బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో విషాదం

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో విషాదం

బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో మరొక విషాదం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సోదరుడు ప్రకాష్ సోమవారం రాత్రి అనారోగ్య కారణంగా మరణించారు. కాగా సీఎం రమేష్ సోదరుడు సీఎం రమేష్ (51) గత కొంత కాలంగా తీవ్రమైన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. ఈమేరకు కాన్సర్ కారణంగా సీఎం రమేష్ సోదరుడు సీఎం ప్రకాష్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో సోమవారం రాత్రి తన స్వగృహంలోనే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇకపోతే ఈ సంవత్సరంలో సీఎం రమేష్ ఇంట్లో ఇది రెండవ విషాదం అని చెప్పాలి. కాగా సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఉండేవారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన కారణంగా ధర్మారామ్ తమ అపార్ట్‌మెంట్ ఏడో ఫ్లోర్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకొని మరణించారు. ఇలా ఒకే ఏడాది తమ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా ఇలా అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.