రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వనిపల్లి శ్రీనివాస్రెడ్డి పదవీ స్వీకరణ కార్యక్రమం మంగళవారం మన్సూరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. వాజపేయి స్ఫూర్తితో వనిపల్లి శ్రీనివాస్రెడ్డి నాయకత్వంలో ప్రతి నాయకుడు, కార్యకర్త రంగారెడ్డి అర్బన్ జిల్లాలో పార్టీ పటిష్ఠతకు పాటుపడాలన్నారు. Congress, BRS, MIM పార్టీల అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనూ బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు.