BREAKING NEWS: ఏపీలో పానీపూరీ తిని ఇద్దరు బాలురు మృతి..

BREAKING NEWS: Two boys die after eating panipuri in AP.
BREAKING NEWS: Two boys die after eating panipuri in AP.

BREAKING: ఏపీలో పానీపూరీ తిని ఇద్దరు బాలురు మృతి చెందారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరులోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది.

దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు రామకృష్ణ(10) విజయ్(6)గా గుర్తించారు పోలీసులు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పానీ పూరి తినడం వల్లే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు . ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.