మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడిపై కేసు నమోదు

Malkajgiri MLA Marri Rajasekhar Reddy
Malkajgiri MLA Marri Rajasekhar Reddy

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిపై ఇవాళ కేసు నమోదైంది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై యేసుబాబు అనే వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. విజన్‌ ప్రాపర్టీ మేనేజ్‌‌మెంట్‌ సర్వీస్‌‌కు మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదని యేసుబాబు ఫిర్యాదు చేశాడు. దీంతో మర్రి రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.