తీవ్ర కలకలం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు

తీవ్ర కలకలం రేపిన చంద్రబాబు వ్యాఖ్యలు

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడీగా సాగుతున్నాయి. అయితే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ ను ఉద్దేశించి ఉన్మాది అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు శాసనసభలో తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేయగా, చంద్రబాబు మాత్రం క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని అన్నారు.

అయితే వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, సభ సంప్రదాయాల ప్రకారం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు ఒప్పుకుని ఆయన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదంటే ఎథిక్స్ కమిటీకి నివేదించాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. ఈ నేపథ్యంలో క్షమాపణ చెప్పకపోతే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేస్తానని స్పీకర్ తేల్చి చెప్పారు.