ఆ వ్యక్తి వలనే కిడారి, సోమ హత్యలు: చంద్రబాబు…!

Chandrababu Comments On Kidari Murder Mistery

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ ఇటీవల మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ విషయం మీద ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. కిడారి, సోమ మృతిపై ఈ భేటీలో పార్టీ నేతలు సంతాపం ప్రకటించిన అనంతరం చంద్రబాబు పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీలో తాజాగా చేరిన ఒక వ్యక్తిని మావోయిస్టులు ట్రాప్ చేశారని అన్నారు.

kidari
ఆ నేత అందించిన సమాచారం ప్రకారమే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సోమ కదలికలపై నిఘా పెట్టారని అన్నారు. అలా ఆ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకే మావోయిస్టులకు వారి వ్యూహరచనలు అమలు చేయడం తేలికైందని చంద్రబాబు స్పష్టంచేశారు. మావోయిస్టులు సంచలనం కోసమే ఈ హత్యలు చేశారని ఆయన అన్నారు. అలాగే తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీని కేసీఆర్‌ ఫినిష్ చెయ్యాలని చూశారని పేర్కొన్నారు. రాజకీయాల్లో వాళ్లు ఎలా ఎదగాలో చూడకుండా మనల్ని అడ్డుకోవడం కోసమే కొందరు రాజకీయాలు చేస్తున్నారని కేసీఆర్ ని ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు. అలాగే ఎక్కడా వ్యక్తిగత విమర్శలు లేకుండా ప్రతిపక్షాలకు బదులివ్వాలని ఆయన కోరారు.

kidari-case