అబద్ధాలు చెప్పడం లో బాబుకి మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి

There is no one better than Babu in telling lies: Lakshiparvati
There is no one better than Babu in telling lies: Lakshiparvati

జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అని అంటూ వైసీపీ నాయకులు, ఎన్టీఆర్ సతీమణి లక్షీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలో లక్షీపార్వతి మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై బాగా విరుచుకు పడ్డారు.

అబ్బద్దాలు ఆడటంలో బాబుకి మించిన వారు ఎవరూ లేరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు . సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘటన ఆయనకే మాత్రమే దక్కిందన్నారు లక్షీపార్వతి. పవన్ కల్యాణ్ కపటంలేని మంచి మనిషి అని అలాంటి వ్యక్తి చంద్రబాబుని నమ్మి మోస పోతున్నాడని అన్నారు. పిఠాపురంలో కాపులంతా ఐక్యం కావాలని, భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతని అసెంబ్లీకి పంపాలని ఆమె పిలుపునిచ్చారు. పవన్ పిఠాపురాని కి వచ్చాడని.. నిరంతంరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకురాలు వంగగీతకే ఓటు వేయాలంటూ ఆమె కోరారు.