బీఆర్ఎస్ లో మోసపోయా…అందుకే కాంగ్రెస్‌లో చేరుతున్న: మైనంపల్లి

BRS chief leaders who joined Congress... KCR in shock..!
BRS chief leaders who joined Congress... KCR in shock..!

బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు రాజకీయ ప్రస్థానంపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఆయన తనకు, తన కుమారుడికి టికెట్ ఇస్తానంటేనే బీఆర్ఎస్‌లో ఉంటానని.. కుమారుడికి టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తితో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనంపల్లి ఈ రూమర్స్‌పై స్పందించారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన మైనంపల్లి తాజాగా కాంగ్రెస్‌ పార్టీకి జై కొట్టారు. కాంగ్రెస్‌లో చేరనున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నేతలు తనను కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. అయితే తాను టికెట్ కోసం బీఆర్ఎస్‌ను వీడలేదని.. పదవి కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లడం లేదని అన్నారు.

అయితే దిల్లీకి వెళ్లి ఆ పార్టీ పెద్దల సమక్షంలో ఈ నెల 27వ తేదీలోపు పార్టీలో చేరతానని చెప్పారు. మెదక్‌లో తన కుమారుడికి మంచి ఆదరణ ఉందని అన్నారు. తాను పార్టీలో నుంచి బయటకు రాగానే.. తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని వాపోయారు. ఈ క్రమంలో తన కార్యకర్తలను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.