తేజ సజ్జా, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన చిత్రం అద్భుతం. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 19న నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో రిలీజ్ అయ్యింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇద్దరు వ్యక్తులకు ఒకే ఫోన్ నంబర్ ఇస్తే ఏం జరుగుతుంది? వారి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్న నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
తాజాగా ఈ చిత్రం గురించి మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘నిన్న రాత్రే హాట్స్టార్లో అద్భుతం మూవీ చూశాను. ఇది ఒక న్యూ ఎంగేజింగ్ నోవెల్ సినిమా. తేజ సజ్జా, శివానీల నటన చాలా ఇంప్రెసివ్గా ఉంది’ అంటూ చిరు ట్వీట్లో పేర్కొన్నారు. మూవీ సక్సెస్పై చిత్ర యూనిట్కి కంగ్రాట్స్ చెప్పారు.