తమిళ నటుడిని కలిసిన తెలుగు క్రీడాకారిణి

తమిళ నటుడిని కలిసిన తెలుగు క్రీడాకారిణి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీ.వీ.సింధు తన పార్టీ ఆఫీసులో కలిసిన నేపథ్యంలో మక్కల్‌నీది మయ్యం-ఎమ్‌ఎన్‌ఎమ్‌ పార్టీ అధ్యక్షుడు, సినీనటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ భేటీ కాదు అని వివరణ ఇచ్చారు. ఈ సందర్బంగా విఖ్యాత నటుడు కమల్‌ హాసన్‌ తన అభిమాన నటుడని అని సింధు తెలిపింది. కమల్‌ హాసన్‌ సింధుని చెన్నైలో బ్యాడ్మింటన్‌ అకాడమీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ, ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి పథకం సాదించడం దేశానికే గర్వకారణం అని ప్రశంసించారు.

ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సింధు పరిమిత సంఖ్యలోనే టోర్నీల్లోనే ఆడతానని స్పష్టం చేస్తూ రానున్న ఒలింపిక్స్‌లో పసిడి పతకం సాధించాలంటే ఫిట్‌నెస్ కాపాడుకుంటూ కొన్ని టోర్నీల్లోనే ఆడతానని తెలిపింది.