రూమర్స్ ని తిప్పికొట్టిన నందినిరెడ్డి

రూమర్స్ ని తిప్పికొట్టిన నందినిరెడ్డి

‘లస్ట్ స్టోరీస్’ వెబ్సిరీస్‌ను రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకురాలు నందిని రెడ్డి నాపై ఈ వెరైటీ రూమర్స్ ఏంటమ్మా? అంటూ ట్విటర్లో స్పందించారు.ఈ వెబ్ సిరీస్‌ నాలుగు భాగాలుగా రాబోతుందని నందినీ రెడ్డి మొదటి భాగాన్ని ఇంకా మిగతా భాగాలను సంకల్ప్ రెడ్డి,సందీప్ రెడ్డి వంగా, తరుణ్ భాస్కర్ చిత్రీకరిస్తున్నారని చాలా వార్తలు వస్తున్నాయి.ఈ కథానాలపై నందినీ రెడ్డి లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ సబ్ టైటిల్స్‌తో సహా నెట్‌ఫ్లిక్స్‌ లో ఉన్నపుడు మళ్లీ రీమేక్ చేయాల్సిన అవసరం ఏం ఉంది అంటూ ట్విటర్ లో అడిగారు.

‘ఓ బేబీ’ తర్వాత స్వప్నదత్, ప్రియాంకదత్‌ లతో కలిసి ఓ సినిమా చేస్తున్న నందిని..తాను తీయబోతున్న చిత్ర నటీనటులు,సాంకేతిక నిపుణులు ఎవరు అన్నది తెలియచేస్తామని తెలిపారు. స్వప్నదత్, ప్రియాంక దత్‌ ఇంతకు ముందు మహానటి సినిమాకు నిర్మాతలుగా ఉన్నారు. వీరి నిర్మాణ సారథ్యం లో రానున్న చిత్రం ఇంకా స్క్రిప్ట్ దశలో ఉన్నది.