హైదరాబాద్ లో దారుణ హత్య…యువతీ గొంతు కోసి !

ప్రేమోన్మాదానికి మరో ముక్కుపచ్చలారని బాలిక బలైంది. ప్రేమ పేరుతో వేధిస్తూ తనకు దక్కదనే అక్కసుతో ఓ మైనర్ బాలికను గొంతు కోసి చంపేశాడు మదమెక్కిన ఓ ప్రేమోన్మాది. హైదరాబాద్ శివారల్లోని ఐడీఏ బొల్లారంలో జరిగిన ఈ విషాద ఘటన కంటతడి పెట్టిస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం ఐడీఏ బొల్లారంలోని వినాయక్‌ నగర్‌లో నివసించే గోరు నిఖిత (15) స్థానిక శ్రీ సాయి విద్యానికేతన్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. అదే కాలనీలో నివాసం ఉండే అరవింద్‌ అలియాస్‌ సోను అనే యువకుడు ఆమెను అనునిత్యం ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఇప్పుడు బీటెక్ చదువుతున్న అరవింద్ రెండేళ్లుగా నిఖిత వెంట పడుతున్నట్లు తెలుస్తోంది.

girl-murder-sangareddy

అయితే చిన్నపిల్లే అయిన నిఖిత అతడి ప్రేమను నిరాకరిస్తూ వస్తోంది. తన తరగతి యువకుడితో మాట్లాడుతుంటే అది ప్రేమని భావించిన అరవింద్ ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని నిఖిత ఎవరికీ దక్క కూడదని ఆమెను పైకి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన నిఖితను కత్తితో గొంతు కోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడిఉన్న నిఖితను చూసి కుటుంబసభ్యులు హతాశులయ్యారు. ఆమెను వెంటనే కూకట్‌పల్లిలోని రెమెడీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిఖిత మృతి చెందింది. దాడి చేసి పారిపోతున్న అరవింద్‌ను స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

boy kills girls at IDA BOLLARAM