కూతుళ్ల పెళ్లిళ్లకు డబ్బులు లేక చంపేశాడు…!

Father Killed His Daughters
కన్న కూతుళ్ల పెళ్లిళ్ళు చేసే స్తోమత లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ తండ్రి వారిని హత్య చేసిన ఘటన కలచి వేస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం నయా ఢిల్లీలోని సంగం విహార్‌లో ఉంటున్ననంద్ కిషోర్ అనే వ్యక్తి తన భార్య తన ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లతో కలిసి ఉంటున్నాడు. సైకిల్ షాపు నడపడం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్న కిషోర్ పెళ్లీడుకు వచ్చిన తన కూతుళ్లకు పెళ్లి చేసేందుకు డబ్బు కావాలని మదన పడుతూ ఉండేవాడు.
killed-fathsr
అయితే ఏమనుకున్నాడో ఏమో నిద్రిస్తున్న తన భార్య విద్యావతి, కూతుళ్లు కవిత (22), సుమన్(24)లను ఐరన్ రాడ్‌తో బలంగా కొట్టి గాయపరిచాడు. సమయంలో కిషోర్ ముగ్గురు కొడుకులు వేరే గదిలో ఉన్నారు. అయితే వారి అరుపులు విని అక్కడికొచ్చిన కొడుకులు తీవ్ర గాయాలైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అందులో కవిత చనిపోయింది. విద్యావతి, ఆమె కుమార్తె సుమన్‌ల పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. పెళ్లీడుకు వచ్చిన కూతుళ్లకు పెళ్లి చేసేందుకు డబ్బులు లేకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురైన కిషోర్ కుటుంబసభ్యుల మీద దాడికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
Father Killed His Daughters