తెలంగాణలో కరోనా కేసులు ఎన్నో తెలుసా?

తెలంగాణలో కరోనా కేసులు ఎన్నో తెలుసా?

తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గత మూడు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువయ్యింది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,967 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 8 మంది చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకుని నేడు 1,781 మంది డిశ్చార్జ్ అయ్యారు.

అయితే తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391 కి చేరింది. ఇదిలా ఉండగా కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 76,967 మంది డిశ్చార్జ్ కాగా ఇంకా 21,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 737కి చేరింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 26,767 మంది శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 8,48,078 టెస్ట్‌లు చేశారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 77.43 శాతం ఉండగా, మరణాల రేటు 0.74% ఉన్నట్టు హెల్త్ బులెటిన్ తెలిపింది.