Crime: మిర్యాలగూడ ఘోర ప్రమాదం… ఆరుకు చేరిన మృతుల సంఖ్య..

Crime: Deadly accident in Miryalaguda... death toll reaches six..
Crime: Deadly accident in Miryalaguda... death toll reaches six..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. మిర్యాలగూడ బైపాస్‌లోని కృష్ణమానస కాలనీ వద్ద అదుపుతప్పిన కారుడివైడర్‌ను ఢీకొని రోడ్డు అవతలకు వెళ్లి కారును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరొకరు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ప్రమాదంలో మొత్తం చెరుపల్లి మహేష్ (34), జ్యోతి (30), యశిక (6), బొమ్మా మశ్చేందర్‌ (29 ), మాధవి (24 ), లియాన్స్ (2) మరణించారు.

ఈ నెల 26వ తేదీన రెండు కార్లలో 13 మంది కుటుంబసభ్యులు ఏపీలోని పలు ఆలయాల సందర్శనకు వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి వస్తున్న సమయంలో మరో ఐదు నిమిషాల్లో ఇల్లు చేరతామనేలోగా నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై కృష్ణానగర్ కాలనీలో ప్రమాదానికి గురైంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులు మిర్యాలగూడ మండలం నందిపాడు గ్రామస్థులుగా గుర్తించారు. మరోవైపు ఈ కారు ఢీకొట్టిన లారీని కూడా పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.