Crime: పేలిన ఆయిల్ ట్యాంకర్.. ఇద్దరి మృతి

Crime: Oil tanker exploded.. Two killed

ఖాళీగా ఉన్న ఆయిల్ ట్యాంకర్ పేలడంతో ఇద్దరు మృతిచెందిన ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. శంఖవరం మండలం కత్తిపూడి శివారుకు మరమ్మతుల కోసం దాన్ని తీసుకొచ్చారు. వెల్డింగ్ చేస్తుండగా ఒక్క సారిగా ట్యాంకర్ పేలింది.

ఈ ఘటనలో కత్తిపూడికి చెందిన కొచ్చెర్ల ప్రభాకర్ (38), బూరా సోమరాజు (39) మృతిచెందారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వేడి తీవ్రతకు ట్యాంకర్ పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబీకులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.