Crime: భార్య ఆత్మహత్య… భర్త కూడా బలవన్మరణం

Crime: Murdered their daughters last month... committed suicide today
Crime: Murdered their daughters last month... committed suicide today

ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం కొల్హారి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న రోజే భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్హారి గ్రామనికి చెందిన విజయ్(24)తో మహారాష్ట్రకు చెందిన పల్లవి(22)కి గతేడాది మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతి పండగకు పుట్టింటికి వెళ్లిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చే సరికి పల్లవి పురుగు మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను రిమ్స్కు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తనపై అపవాదు వస్తుందన్న భయంతో ఆమె భర్త విజయ్ శ్మశానవాటికకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.