చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే సినిమాల‌తో జాతికి ప్ర‌మాదం

Deepika Padukone Padmavathi in trouble,Deepika Padukone in trouble, padmavathi movie in trouble, deepika padukune padmavathi movie in trouble, deepika movie in trouble, padmavathi movie, padmavathi movie details

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ప‌ద్మావ‌తి చిత్రంపై వివాదాలు కొన‌సాగుతున్నాయి. నిన్న‌టిదాకా రాజ్ పుత్ క‌ర్ణి సేన సినిమా విడుద‌ల‌ను ఆపేందుకు పోరాటం చేస్తుండ‌గా..ఇప్పుడు మేవార్ రాజ‌వంశ‌స్థులు వారికి జ‌త క‌లిశారు. ప‌ద్మావ‌తిలో రాజ‌పుత్రుల చ‌రిత్ర‌ను వక్రీక‌రించార‌ని మేవార్ రాజ‌వంశ‌స్థుడు ఎంకే విశ్వ‌రాజ్ సింగ్ ఆరోపించారు. హిందువుల చ‌రిత్ర‌తో పాటు భార‌త‌దేశ చ‌రిత్ర‌ను కాపాడాల్సిన బాధ్య‌త కేంద్ర ప్ర‌భుత్వానికి ఉంద‌ని ఆయ‌న అన్నారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించి రూపొందించిన ప‌ద్మావ‌తి సినిమా విడుద‌ల‌ను నిలిపివేయించాల‌ని కోరారు. ఈ మేరకు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి,  సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం స‌ర్టిఫికేష‌న్ చైర్మ‌న్ కు స‌మాచార‌, ప్ర‌సార శాఖ మంత్రి స్మృతి ఇరానీకి, మాన‌వ వ‌న‌రులు, అభివృద్ధి శాఖ మంత్రి ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ కు, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌రారాజే సింథియాకు ఆయ‌న లేఖ రాశారు. రాణి ప‌ద్మిణిపై ప‌రిశోధ‌న చేసి ఈ సినిమాను రూపొందించానని సంజ‌య్ లీలా భ‌న్సాలీ చెబుతున్నార‌ని, ఇంత‌వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఆయ‌న త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని విశ్వ‌రాజ్ సింగ్ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించే చిత్రాల‌తో జాతికి ప్ర‌మాద‌మ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ప‌ద్మావ‌తి ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌రు 1న విడుద‌ల కానుంది.

సినిమా రిలీజ్ కు ఇంకా కొన్నిరోజుల గ‌డువే ఉండ‌డంతో ప‌ద్మావ‌తిపై వివాదాలు ముసురుకుంటున్నాయి. నిజానికి భ‌న్సాలీ బాజీరావ్ మ‌స్తానీ త‌ర్వాత ప‌ద్మావ‌తి ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుంచే కొంద‌రు ఈ సినిమాను వ్య‌తిరేకిస్తున్నారు. చిత్తోర్ రాణి ప‌ద్మిణి జీవితం ఆధారంగా రూపొందుతున్న ప‌ద్మావ‌తిలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్ర‌ను భ‌న్సాలీ తెర‌కెక్కించే తీరుపై రాజ్ పుత్ ల్లో అనేక సందేహాలు ఉన్నాయి. లౌకిక భావ‌జాలంతో ఉండే భ‌న్సాలీ ఖిల్లీ, పద్మిణి క్యారెక్ట‌ర్ల‌ను రాజ్ పుత్ ల పౌరుషాన్ని చూపించేలా కాకుండా..సుల్తాన్ ల గొప్ప‌తనాన్ని ప్ర‌తిబింబించేలా తీస్తాడ‌న్న ఆందోళ‌న‌ హిందూ సంస్థ‌ల నుంచి వ్య‌క్త‌మ‌యింది.  జీవితంలో ఒక్క‌సారి కూడా క‌లుసుకోని ఖిల్జీ, ప‌ద్మిణి మ‌ధ్య ప్రేమ స‌న్నివేశాలు ఉన్నాయ‌న్న వార్త‌లు రావ‌డం కూడా రాజ్ పుత్ వ‌ర్గాలకు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. చ‌రిత్ర ప్ర‌కారం ఖిల్జీ చేతిలో చిత్తోర్ రాజు రావ‌ల్ ర‌త‌న్ సింగ్ ఓడిపోయిన‌ప్ప‌టికీ..సినిమాలో దాన్ని తెర‌కెక్కించే విధానం రాజ్ పుత్ ల‌ను బ‌ల‌హీనులుగా భావించేలా ఉంటుంద‌న్న అభిప్రాయ‌మూ వ్య‌క్తమ‌వుతున్న నేప‌థ్యంలో ప‌ద్మావ‌తి విడుద‌ల‌ను ఎలాగైనా అడ్డుకోవాల‌ని రాజ‌స్థాన్ రాజ‌వంశీయులు ప్ర‌య‌త్నిస్తున్నారు.