దక్షిణాది రాష్ట్రాల ఆలయాల పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఉన్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు పవన్. మహర్షి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పవన్. ఆయన వెంట కుమారుడు అకీరా, టీటీడీ మెంబర్ ఆనంద్సాయి ఉన్నారు. అటు తిరుమల లడ్డూ వివాదం దురదృష్టకరమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆలయాల నుంచి ఎవరూ లాభాలు ఆశించకూడదన్నారు. ఘటనకు బాధ్యులైన నిందితులు అరెస్ట్ అయ్యారని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.