ముంబైలో మొదలు పెట్టిన దిల్ రాజు..

టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు హిందీలో ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు గానీ, షూటింగ్ ఇప్పట్లో మొదలు పెట్టకపోవచ్చుననే మాట వినిపించింది. కానీ, సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చాడు దిల్ రాజు. ఆ వివరాల్లోకి వెల్దాం.

నిర్మాత దిల్ రాజుకి అత్యంత సన్నిహితుడు దర్శకుడు వంశీ పైడిపల్లి. రెండేళ్ళకో, మూడేళ్ళకో ఓ సినిమాను తీసే ఈ దర్శకుడు..మొదటి నుంచి దిల్ రాజు కాంపౌండ్ లోనే ఉంటున్నాడు. అలా, వీరి కాంబినేషన్‌లో మున్నా, బృందావనం, ఎవడు, వారసుడు లాంటి సినిమాలొచ్చాయి. వీటిలో తమిళ హీరో విజయ్ తో చేసిన వారసుడు ఫ్లాపవగా, మున్నా యావరేజ్‌గా..బృందావనం, ఎవడు సూపర్ హిట్ అయ్యాయి. కాంబినేషన్‌లో చేసిన మహర్షి సూపర్ హిట్ అయింది.

అయితే, దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడి పల్లి బాలీవుడ్ డెబ్యూ మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా, నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా, ఈ సినిమా ఓపెనింగ్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఇది ఎవరూ ఊహించలేదు. ఒకవేళ షూటింగ్ స్టార్ట్ అయినా, హైదరాబాద్ లో మొదలవుతుందనుకున్నారు. కానీ, దిల్ రాజు ముంబైలో మొదలు పెట్టాడు.

ఈ మధ్య కాలంలో ఫుల్ ఫాంలో ఉంది హీరోయిన్ నయనతార మాత్రమే. ఆమె ఒక్కటే వరుస సక్సెస్‌లతో దూసుకెళుతోంది. హీరోగా సల్మాన్ గత కొంతకాలంగా సక్సెస్‌లను చూడలేదు. తెలుగులో ఇచ్చిన గెస్ట్ అపీరియన్స్ కూడా కలిసి రాలేదు. అలాగే, నిర్మాత దిల్ రాజు పరిస్థితి ప్రస్తుతం ఏమంత బాగోలేదనే అంటున్నారు. ఇక, దిల్ రాజు లేకపోతే వంశీ పైడి పల్లి లేడనే మాట ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో దర్శక నిర్మాతలతో పాటు హీరో కి హిట్ గ్యారెంటీగా పడి తీరాలి. మరి, వంశీ పైడిపల్లిని నమ్మి దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఎంతవరకూ సక్సెస్ ఇస్తాడో చూడాలి.