అసెంబ్లీ లో ఉల్లిపాయలపై చర్చ

అసెంబ్లీ లో ఉల్లిపాయలపై చర్చ

ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షం ఉల్లిపాయల మీద ఏదైతే సబ్జెక్ట్ తీసుకొని వస్తున్నారో ఆ ఉల్లిపాయలపై చర్చ జరపటానికి సిద్ధంగానే ఉన్నామని జగన్ అన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం చెయ్యని కార్యక్రమాలు మా ప్రభుత్వం చేస్తోందని జగన్ అన్నారు. ఉల్లి గురించే మాట్లాడుతున్నానని దేశం మొత్తం మీద ఏపీలో మాత్రమే కేజీ 25 రూపాయలకు ప్రజలకు అందుతోందని జగన్ అన్నారు.

ఇంత తక్కువ రేటుకు ఉల్లిని అమ్ముతున్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే అని సీఎం జగన్ అన్నారు. ప్రతి రైతు బజార్ లోను 25 రూపాయలకే కేజీ ఉల్లిని అమ్ముతున్నామని జగన్ చెప్పారు. ఇప్పటివరకు 36,536 క్వింటాళ్లు కొనుగోలు చేసి రైతు బజార్లలో కేజీ 25 రూపాయలకు అమ్ముతున్నామని జగన్ అన్నారు. సోలాపూర్, అల్వాల్ నుండి కూడా ఉల్లిని కొనుగోలు చేసున్నామని సీఎం జగన్ చెప్పారు.