టాలీవుడ్ మాస్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ మూవీ “డబుల్ ఇస్మార్ట్” కోసం అందరికి తెలిసిందే. మరి మాస్ లో సాలిడ్ క్రేజ్ అండ్ కం బ్యాక్ ని పూరి, రామ్ లు ఇచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తున్నా ఈ మూవీ పై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ లాంచ్ కు డేట్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసిన సంగతి అందరికి తెలిసిందే.

అలాగే వైజాగ్ లో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకి గురజాడ కళాక్షేత్రంలో లాంచ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు . అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కు అందరూ రావచ్చని కన్ఫర్మ్ చేశారు. నిర్మాత ఛార్మి మాస్ ఫ్యాన్స్ అందరూ రావచ్చు వచ్చి మాస్ ఫీస్ట్ చేసుకుందాం అని అంటూ పోస్ట్ చేసింది. దీనితో ఆ ఈవెంట్ కు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ఫ్యాన్స్ సహా ఇతర ఆడియెన్స్ కూడా వెళ్లిపోవచ్చని చెప్పాలి. ఇక ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందిస్తుండగా మేకర్స్ ఈ ఆగస్టు 15న పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ ని రిలీజ్ చేయబోతున్నారు.
VIZAG ! See you tomorrow
#DoubleiSmartTrailer Launch at Gurajada Kalakshetram, Vizag, 6PM Onwards
Come let’s make this Sunday Super Massive with #DoubleiSmart
#DoubleiSmartOnAug15 pic.twitter.com/bxTO1sRXin
— Charmme Kaur (@Charmmeofficial) August 3, 2024