Election Updates: ఎన్నికల్లో పోటీపై సంచలన ప్రకటన చేసిన బోడే ప్రసాద్

Election Updates: Bode Prasad made a sensational announcement about contesting the elections
Election Updates: Bode Prasad made a sensational announcement about contesting the elections

ఎన్నికల్లో పోటీపై బోడే ప్రసాద్ సంచలన ప్రకటన చేశారు. టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నాను…అధిష్టానం తీసుకునే నిర్ణయం బట్టి నేను పోటీ చేసే విషయం ఆధార పడి ఉంటుందని తెలిపారు. బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నాను…నాకంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ IVRS సర్వే చేస్తున్నారని భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం… అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా అని వంశీ అన్నాడని గుర్తు చేశారు. నేను వంశీతో మాట్లాడటం కలవటం జరగలేదు….ఇది జరిగిందని ఎవరైనా చెబితే దమ్ముంటే వాళ్ళు నిరూపించాలని సవాల్‌ చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవు….పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని ముందే చెప్పానన్నారు. నాకు వంశీ, కొడాలి తో సత్సంబంధాలు ఉంటే నేను ఎందుకు చెబుతానని ప్రశ్నించారు.