Election Updates: ఇటు కూతురు.. అటు కొడుకు.. విదేశాలకు విజయమ్మ..

Election Updates: This daughter.. that son.. Vijayamma abroad..
Election Updates: This daughter.. that son.. Vijayamma abroad..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వైయస్ విజయమ్మ అమెరికాకు వెళ్ళిపోయారు. ఇటు కూతురు అటు కొడుకు ఇద్దరి మధ్య నలిగిపోయిన విజయమ్మ… అమెరికాకు వెళ్ళినారని సమాచారం. ఇటీవల అంటే 14 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు. ఆ సందర్భంగా ఇడుపులపాయలో ప్రత్యేక పూజలు చేశారు వైయస్ విజయమ్మ.

అనంతరం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర ప్రారంభించారు. ఇటు షర్మిల మొన్ననే బస్సుయాత్ర ప్రారంభించారు. ఆ యాత్రకు కూడా ప్రత్యేక పూజలు చేశారు విజయమ్మ. ఇక ఇప్పుడు ప్రచారం చేసే సమయం. ఇలాంటి నేపథ్యంలో కూతురికి ప్రచారం చేయాలా ? లేదా కొడుకు కోసం ప్రచారం చేయాలా? అని సందిగ్ధంలో వైయస్ విజయమ్మ ఉన్నారు. దీంతో చేసేదేమీ లేక తాజాగా తమ కుటుంబ సభ్యులు ఉన్న అమెరికాలోని ఇంటికి విజయమ్మ వెళ్లారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వైయస్ విజయమ్మకు ఇంతటి కష్టం వచ్చిందా అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.