ఎవరి గోల వాళ్లదే… కరోనా అంటే ఎవరికీ భయం లేదు

ఒక పక్కన కరోనా తో ప్రపంచం అంత అతలాకుతలం ఐతుంటే ఈ కిలాడీలు దొంగలు మాత్రం వాళ్ళ చేతి వాటం చూపిస్తున్నారు. ప్రధాని మోడీ దేశమంతా లాక్ డౌన్ చేసి ఇంట్లో నుంచి బయటకు రావద్దు అని అంటుంటే వీళ్ళు మాత్రం ఏకంగా గంజాయి తరలిస్తూ బుధవారం 25 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారు .

పోలీస్ చెక్ పోస్ట్ దెగ్గర సీలేరు నుంచి మహారాష్ట్ర లోని పర్బాని కి ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై గంజాయిని తీసుకెళ్తుండగా వాహనాల తనిఖీలో దొరికిపోయారు.

పోలీసులుల కధనం ప్రకారం లాక్ అవుట్ కారణంగా బుధవారం ఏన్కూర్ తాహసిల్దార్ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ పై మూడు బ్యాగుల్లో 25 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. వీరిద్దరి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.