యాదగిరిగుట్టలో విషాదం

యాదగిరిగుట్టలో విషాదం

యాదగిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ లాడ్జి పైనుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని హైదరాబాద్‌ లింగంపల్లికి చెందిన చెరకూరి సురేష్‌, శ్రేష్ఠగా పోలీసులు గుర్తించారు.

మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా.. భార్యభర్తల మధ్య గొడవ ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది.