వరల్డ్ కప్ టీం ను ప్రకటించిన మాజీ బీసీసీఐ అధ్యక్షుడు..!

Former BCCI president announced the World Cup team
Former BCCI president announced the World Cup team

ఈ సంవత్సరంలో మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది . అందుకే అభిమానులు ఈ మ్యాచ్ ల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా ఇండియా ఇప్పటి వరకు వరల్డ్ కప్ లో ఆడనున్న జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతానికి అందరి మెదడులో కేవలం సమీకరణాలు ఉన్నాయి. మరి వరల్డ్ కప్ ఆడనున్న ఆ 15 మంది సభ్యులతో కూడిన జట్టు ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజాగా వీరు ఉంటే వరల్డ్ కప్ లో ఇండియా కప్ ను అందుకుంటుందని మాజీ బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బలంగా నమ్ముతున్నాడు.

ఇక ఈయన ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ(C), గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్(WC), శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా,హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, షమీ, కుల్దీప్ యాదవ్, సిరాజ్ మరియు శార్దూల ఠాకూర్ లు ఉన్నారు. ఇంకా అభిమానులు ఆసిస్తూ జట్టులో చోటు దక్కని వారిలో సంజు శాంసన్ మరియు చాహల్ లు ఉన్నారు.