‘నేను నీపై నిఘా పెడతాను!’ అని ఫొటోలు షేర్ చేసి.. డిలీట్ చేసిన ఇస్రో.. ఏమైందో.?

ISRO
ISRO

చంద్రయాన్ 2 ఆర్బిటార్ తాజాగా తీసిన విక్రమ్​ ల్యాండర్​ ఫొటోలను ఇస్రో సోషల్ మీడియా ఎక్స్​ (ట్విటర్)లో పోస్టు చేసింది. ‘నేను నీపై నిఘా పెడతాను!’ అంటూ చంద్రయాన్-2 ఆర్బిటార్ చేసిన వ్యాఖ్యలను క్యాప్షన్​గా ఇచ్చింది. అయితే ఈ పోస్టును కాసేపటికే డిలీట్ చేసింది. దీంతో ఏమైందోనని ప్రజలు గందరగోళంలో పడిపోయారు. అయితే ఇస్రో పెట్టిన పోస్టులో ఇంకా ఏం చెప్పిందంటే..?

‘చంద్రయాన్-2 ఆర్బిటర్.. చంద్రయాన్-3 ల్యాండర్​ను ఫొటోషూట్‌ చేసింది. ప్రస్తుతం చంద్రుడిపై ఉన్న అత్యుత్తమ రిజల్యూషన్ ఉన్న కెమెరా,చంద్రయాన్-2 ఆర్బిటర్ హై-రిజల్యూషన్ కెమెరా . 23/08/23న ల్యాండ్ అయిన తర్వాత చంద్రయాన్-3 ల్యాండర్‌ను గుర్తించింది’ అని ఇస్రో పోస్టులో పేర్కొంటూ.. రెండు ఫొటోలను కూడా పోస్ట్​ చేసింది.