సరిహద్దులో నలుగురు భారతీయుల మృతి

సరిహద్దులో నలుగురు భారతీయుల మృతి

భారత దేశానికి చెందిన నలుగురు వ్కక్తులు కెనడా‌‌‌‌‌‌-అమెరికా సరిహద్దు ప్రాంతంలో మృతి చెందినట్లు ఆ దేశాల సరిహద్దు అధికారులు గుర్తించారు. వెంటనే భారత విదేశాంగ శాఖకు సమాచారం అందించారు. ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్.​ జైశంకర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతుల్లో పసిపాప కూడా ఉన్నట్లు సమాచారం. అయితే, దీనిపై అత్యవసర సమావేశం నిర్వహించిన జైశంకర్​ ఆయాదేశాల్లో ఉన్నటువంటి భారత రాయబారులను అప్రమత్తం చేశారు. మృతి చెందిన వారిని గుర్తించాలని.. అదే విధంగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.