సోషల్‌ మీడియాలో పరిచయం….యువతి ఆత్మహత్య

సోషల్‌ మీడియాలో పరిచయం....యువతి ఆత్మహత్య

సోషల్‌ మీడియాలో పరిచయమైన అపరిచిత యువకుడు బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేధిస్తున్నాడని ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన శికారిపుర తాలూకా శిరాళకొప్పలో జరిగింది. బీఏ చదువుకున్న 23 ఏళ్ల యువతికి ఇన్‌స్టా గ్రామ్‌లో అపరిచిత వ్యక్తి పరిచయం అయ్యాడు.

ఎప్పుడూ ఫోన్‌ చేస్తుండేవాడు. యువతి నగ్న వీడియో అప్‌లోడ్‌ చేస్తానంటూ బెదిరించేవాడు. అతని వేధింపులకు భయపడిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఊపిరి తీసుకుంది. శిరాళకొప్ప పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.