ఉరి వేసుకుని ప్రియురాలు ఆత్మహత్య

ఉరి వేసుకుని ప్రియురాలు ఆత్మహత్య

పెళ్లి విషయంలో మాటామాటా పెరిగి ప్రేమికుడి గదిలో ప్రియురాలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం.. పాండురంగానగర్‌ ప్రాంతానికి చెందిన నర్సింహులు కుమార్తె (17) వికారాబాద్‌కు చెందిన శ్రీకాంత్‌తో మూడేళ్లుగా ప్రేమలో ఉంది. శ్రీకాంత్‌ హైదర్‌గూడలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు.

కాగా తరచూ శ్రీకాంత్‌ దగ్గరకు వస్తుండే ప్రవీణ గురువారం కూడా అలాగే వచ్చింది. పెళ్లి చేసుకోవాలని శ్రీకాంత్‌ను కోరడంతో అతను కొంత సమయం కావాలన్నాడు. ఈ విషయంలో కాసేపు ఇద్దరు గొడవపడ్డారు. అనంతరం శ్రీకాంత్‌ బయటకు వెళ్లిన సమయంలో ప్రవీణ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.