బామ్మపై మనవడు దాడి.. వృద్ధురాలు మృతి

ఆంధ్రప్రదేశ్ లోని చిలకలూరిపేటలో ఘోరం జరిగింది. ఓ వృద్ధురాలిని మతిస్థమితం లేని మనవడు హత్యచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. సీఐ సత్య నారాయణ చెప్పిన వివరాల ప్రకారం… స్థానిక ఎన్టీఆర్ కాలనీ ఒకటో లైన్లో పోలూరి సుబ్బాయమ్మ రేకుల ఇంట్లో అద్దెకు ఉంటోంది. అయితే ఆమె కుమారుడు శివాజీ, కోడలు సావిత్రి కొంతకాలం క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.

కాగా వారిలో శివాజీకి రమేష్, శ్రీశ్రీ అని ఇద్దరు కొడుకులు, కుమార్తె శారద ఉన్నారు. వీరిలో రమేష్ కు మతిస్థిమితం సరిగ్గా లేకపోవడంతో చాలా కాలంగా కుటుంబానికి దూరంగా బామ్మ సుబ్బాయమ్మ వద్ద ఉంటున్నాడు. రోజూ ఆమెను డబ్బులు ఇవ్వమని పీడిస్తున్నాడు. తాజాగా జరిగిన గొడవలో.. ఆమెను చిన్న సిలిండర్ తో కొట్టాడు. దాంతో ఆమె కేకలు వేయగా… స్థానికంగా పలువురు వచ్చారు. అప్పటికే సుబ్బాయమ్మ మృతి చెందింది. తర్వాత పంచనామా జరిపి పోస్ట్ మర్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.