టెక్కీని ట్రాప్‌లోకి లాగి ప్రేమ

టెక్కీని ట్రాప్‌లోకి లాగి ప్రేమ

ఫేస్‌బుక్‌ ద్వారా ఓ టెక్కీని ట్రాప్‌లోకి లాగి ప్రేమ, పెళ్లి పేరుతో అతడి నుంచి కోటి రూపాయలు దోచుకున్న ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. వయసు 40ఏళ్లు దాటిగా ఇంకా పెళ్లి కాలేదు. మ్యాట్రిమోని ప్రొఫైల్‌లో అతడి వివరాలు చూసిన గుంటూరు జిల్లాకు చెందిన యర్రగుడ్ల దాసు, జ్యోతి దంపతులు అతడి ట్రాప్‌లోకి లాగి డబ్బులు గుంజాలని ప్లాన్ వేశారు.

ఈ క్రమంలోనే ఏడాదిన్నర క్రితం యర్రగుడ్ల దాసు.. కల్యాణిశ్రీ పేరుతో ఫేస్‌బుక్‌ ద్వారా ఆ టెక్కీకి పరిచమయ్యాడు. తాను విజయవాడలో ఉంటున్నానని, సంప్రదాయ కుటుంబమని చెప్పాడు. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పి.. విజయవాడకు రావొద్దని, కేవలం చాటింగ్ ద్వారానే మాట్లాడుకుందామని కండిషన్ పెట్టాడు. దాసును నిజంగానే కల్యాణిశ్రీ అనుకున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌.. తానూ ప్రేమిస్తున్నానని, ఇష్టమైతే పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. ఒక్కసారి కలుద్దాం అంటూ కోరగా.. పెళ్లి సంబంధం మధుసూదన్‌ అనే వ్యక్తితో మాట్లాడాలంటూ ఒక ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు.

అయితే మధుసూదన్‌లా కూడా దాసే గొంతు మార్చి మాట్లాడాడు.అనంతరం ఖర్చులు, ఇతర అవసరాల పేరుతో జూన్‌ 2020 నుంచి అక్టోబరు 2021 వరకు కోటి రూపాయల వరకు దాసు కాజేశాడు. అనంతరం అవతలి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ జి.వెంకట్రామిరెడ్డి గుంటూరు జిల్లా సత్తెనపల్లికి వెళ్లి దాసు, అతడి భార్యను అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.

వీరిని మంగళవారం కోర్టులో హాజరుపరిచి అనంతరం జైలుకు తరలించారు.నిందితుడు దాసును నూజివీడు ట్రిపుల్‌ ఐటీ పూర్వ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పని చేసే అతడు ఆన్‌లైన్‌ రమ్మీ బానిసై విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో సంస్థ ఉద్యోగంలో నుంచి తొలగించింది. బెట్టింగులకు బానిసై డబ్బుల కోసం ఇలా ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.