గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వ్రైస్ చాన్స్లర్-2గా వర్సిటీలోని స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సీనియర్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ బీ.రాజశేఖర్ నియమితులైనట్లు వర్సిటీ పీఆర్ఓ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఉన్నత విద్య, అకాడమిక్, అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్గా రాజశేఖర్కు అనుభవం ఉందని, 1999 నుంచి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్తో అనుబంధం ఉన్నట్లు తెలిపారు. వైస్చాన్స్లర్గా ఉన్న ప్రొఫెసర్ పీ.ప్రకాశ్ బాబు పదవీకాలం శుక్రవారంతో ముగియగా, ఆయన స్థానంలో రాజశేఖర్ నియమితులయ్యారు.