UPలో కలకలం: హైవేపై తల లేకుండా మహిళ నగ్న మృతదేహం

UP Crime Case
UP Crime Case

తలలేకుండా.. నగ్నంగా గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడి ఉండటం ఘటన ఉత్తర్ ప్రదే‌శ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం కాన్పూర్ సమీపంలోని గుజైనా వద్ద నగ్న మృతదేహాన్ని గుర్తించారు. అత్యాచారం తర్వాత హత్యచేసి జాతీయ రహదారిపై విసిరేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఘటన వెలుగులోకి వచ్చి 24 గంటలు గడిచినా ఈ కేసులో పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు. ఆమె ఎవరు? అనేది ఇంకా గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మృతదేహాం పడి ఉన్న ప్రాంతానికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. హైవేకి అవతలి వైపున ఉన్న ఆసుపత్రి వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాల్లో మృతదేహాన్ని గుర్తించడానికి కొద్ది గంటల ముందు అలాగే ఉన్న ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యింది. ఆ మహిళ బూడిద రంగు ప్యాంటు ధరించి ఉండగా.. మృతదేహానికి సమీపంలో అదే రంగులో ఉన్న వస్త్రం ముక్కలు కనిపించాయి. బుధవారం ఉదయం 6.15 గంటలకు నగ్నంగా ఉన్న తలలేని మహిళ మృతదేహం తొలుత గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తు కోసం మూడు బృందాలను ఏర్పాటుచేసినట్టు పేర్కొన్నారు.

శవం గుర్తించిన ప్రదేశంలో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేవు కానీ, 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఓ మహిళ నడుచుకుంటూ వెళ్లడం రికార్డయ్యిందని చెప్పారు. ఆమె ధరించిన దుస్తులు.. మృతదేహం వద్ద ఉన్న వస్త్రం పీలికలు ఒకే రంగులో ఉన్నాయని వివరించారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని సీసీటీవీని నిశితంగా పరిశీలిస్తున్నారు.

ఆమె చనిపోయింది? అనేది నిర్దారించడానికి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా, జిల్లాలో మహిళ మిస్సింగ్‌పై తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలను స్థానికులకు చూపించి ఆమె గురించి సమాచారం తెలుసా? అని ప్రశ్నిస్తున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలిలోనూ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి, ఆమె దంతాలు, ఎముకల నుంచి నమూనాలను సేకరించారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా నేరమా? బాధితురాలు స్థానిక మహిళేనా? వేరే ప్రాంతానికి చెందింది అనేది నిర్దారించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.