దళిత బంధు పథకంపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

దళిత బంధు పథకంపై కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.ఈ పథకంపై ధాఖలు చేసిన పిటీషన్ అత్యవసరంగా విచారించలేమన్న హైకోర్టు చీఫ్ జస్టీస్ హిమా కోహ్లీ పేర్కొన్నారు. దళిత బంధు పైలెట్ ప్రాజెక్టును నిలిపుదల చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు అయ్యింది. ఈ పిల్‌ను జనవాహిని పార్టీ, జైస్వరాజ్ పార్టీ, తెలంగాణ రిపబ్లిక్ పార్టీ.. దాఖలు చేసింది.

హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టు చేపట్టడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ దారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ, టీఆర్ఎస్ , కాంగ్రెస్, బీజేపీ, సీఎం కేసీఆర్ ను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్లు.
అత్యవసరంగా విచారించాలని కోరిన పిటీషనర్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే అత్యవసర విచారణ చేపట్టలేమని.. లిస్ట్ ప్రకారం విచారిస్తామన్న హైకోర్టు పేర్కొంది. అప్పటి వరకు అగాలని పిటీషనర్ కు న్యాయస్థానం సూచించింది.