దారుణం…ప్రియుణ్ణి మంచానికి కట్టి కాల్చేసింది !

home guard burnt alive by lover

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన ఒకటి జరిగింది. క్షణిక సుఖాల కోసం అలావాటు పడుతున్న నేటి సమాజం ఆ క్షణిక సుఖాల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడడం లేదు. అలా తనకు ఏమీ కాని ఒక మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ప్రియుడి పై కోపంతో ఆ మహిళ అతన్ని మంచానికి కట్టేసి ఆపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి చంపేసింది. అతని కేకలు విన్న చుట్టుపక్కలవాళ్లు కాపాడే ప్రయత్నం చేయబోయినా మంచానికి గొలుసులతో కట్టేసి ఉండడం వల్ల సాధ్యపడలేదు. కొనకనమిట్ల మండలం చౌటపాలెంలో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాలలోకి వెళితే పొదిలికి చెందిన షేక్ షబ్బీర్ (32) అనే హోమ్ గార్డుతో షకీరా అలియాస్ ఇమాంబీ వివాహేతర సంబంధం పెట్టుకుంది.

ఆమే కోళ్ల ఫారాలను లీజుకు తీసుకుని నడుపుతూ ఉంటుంది, కొన్ని నెలలుగా షబ్బీర్ విధులకు సైతం హాజరు కాకుండా ఆమెతో పాటు కోళ్ల ఫారాలను నడుపుతూ ఆమెతోనే సహజీవనం చేస్తున్నాడు. అయితే వారి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరిగాయి. శనివారం రాత్రి ఇద్దరూ చవటపల్లిలోని కోళ్ల ఫారానికి వెళ్లారు. ఇద్దరి మధ్యా ఏం జరిగిందో తెలియదుగానీ, కోళ్ల ఫారం నుంచి మంటలు వచ్చాయి. మంటలెందుకు వచ్చాయని స్థానికులు ప్రశ్నించగా, విద్యుత్ షార్టు సర్క్యూట్ జరిగిందని షకీరా వెల్లడించింది. దాని యజమాని లోనికి వెళ్లి చూడగా, షబ్బీర్ విగత జీవుడిగా కనిపించాడు. మంచానికి అతని చేతులు, కాళ్లు గొలుసులతో కట్టేసి, తాళాలు వేసి ఉన్నాయి. కిరోసిన్ పోసి నిప్పంటించినట్టు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడాయన. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి విచారణ ప్రారంభించారు.