ముసలివాడితో అక్రమ సంబంధం..పెళ్లి వద్దందని నరికి చంపాడు !

Illicit Affair killed Two Children At Kurnool

ప్రేమకి వయసుతో పని లేదు, ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా పుడుతుందో తెలీదు. కానీ నేటి సమాజంలో మాత్రం అవసరాలకు ప్రేమ అనే పేరు వాడుతూ ఎవరికీ కావాల్సింది వారు పొందుతున్నారు. ఆ ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడితే ప్రాణాలు తీసుకోడానికి అవసరం అయితే తీయడానికి ఎక్కడా వెనకాడడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది, తమిళనాడు రాష్ట్రంలోని సేలంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉన్న కాసా కారనూర్ ఏరియాకు చెందిన పాండ్యారాజన్ అనే వ్యక్తి ఓ ఐస్‌క్రీమ్ షాప్ నడుపుతున్నాడు. ఈ షాపులో పనిచేస్తున్న 25 ఏళ్ల సితారకు, అదే దుకాణంలో పనిచేస్తున్న ఇనాముల్లా అనే 54 ఏళ్ల వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త నుంచి విడాకులు తీసుకుని, కూతురితో కలిసి ఉంటున్న సితార ఇనాముల్లాతో కలిసి రెండేళ్లు శారీరక సంబంధం కొనసాగించింది. అప్పటికే పెళ్లై, పిల్లలు, మనవళ్లు కూడా ఉన్న ఇనాముల్లా సితార పరిచయం ఏర్పడిన తర్వాత భార్యాపిల్లలను పట్టించుకోవడం మానేశాడు. యువతితో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న విషయం తెలుసుకున్న ఇనాముల్లా భార్య, పిల్లలు అతనిని ఇంటి నుండి వెళ్ళకొట్టారు. ఈ నేపధ్యంలో అతను సహజీవనం చేస్తున్న సితారను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే సంబంధానికి ఓకే కానీ పెళ్లి గిళ్ళి అంటే కుదరదని చెప్పింది సదరు ప్రియురాలు. దీంతో అగ్గి మీద గుగ్గిలం అయిన ఇనాముల్లా కత్తితో ఆమెను కసి తీరా నరికి చంపాడు. సితార అరుపులతో పోలీసులకు సమాచారం అందించారు చుట్టుపక్కల వారు. పోలీసులు వచ్చేప్పటికే సితార శవమై కనిపించింది. ఇనాముల్లా కోసం గాలించగా అప్పటికే పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. సంఘటనా స్థలంలో ఇనాముల్లా రాసిన ఉత్తరం ద్వారా జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.