మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఇరుముడి’ Irumudi బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో దూసుకెళ్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ను అందుకుంది. దీంతో రవితేజ కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న చిత్రంగా ‘ఇరుముడి’ నిలిచింది.
విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. ముఖ్యంగా వీకెండ్ తర్వాత కూడా వసూళ్లు ఏమాత్రం తగ్గకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.
సోమవారం కూడా తగ్గని జోరు
సాధారణంగా సినిమాలకు మొదటి సోమవారం వసూళ్లు, బుకింగ్స్ కొంత మేర తగ్గడం సహజం. అయితే ‘ఇరుముడి’ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. మొదటి రోజుకు దాదాపు సమానంగా సోమవారం బుకింగ్స్ నమోదవడంతో ఈ సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
రీజినల్ సినిమాల పరంగా ఫస్ట్ మండే అత్యధిక బుకింగ్స్ సాధించిన చిత్రాల్లో ‘ఇరుముడి’ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అంతేకాకుండా ఏపీ, తెలంగాణలో ‘బాహుబలి 2’ తర్వాత అత్యంత అరుదైన స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదైనట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
38 లక్షలు దాటిన టికెట్ సేల్స్
‘ఇరుముడి’పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్కు టికెట్ సేల్స్ మరో నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ అయిన బుక్మైషో, డిస్ట్రిక్ట్ వంటి యాప్స్లో కలిపి ఈ సినిమా ఇప్పటివరకు 38 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
నాలుగు రోజుల్లోనే ఇంత భారీ స్థాయిలో టికెట్లు అమ్ముడవడం సినిమా బాక్సాఫీస్ స్టామినాను తెలియజేస్తోంది. ముఖ్యంగా ఐదో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటంతో సినిమా జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
పలు ప్రాంతాల్లో హౌస్ఫుల్ బోర్డులు
ఏపీ, తెలంగాణలోని పలు ప్రధాన కేంద్రాల్లో ‘ఇరుముడి’ షోలకు ఇప్పటికే హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వీకెండ్ ముగిసిన తర్వాత కూడా థియేటర్లలో ఆక్యుపెన్సీ బలంగా కొనసాగుతుండటం సినిమాకు కలిసొస్తోంది.
రూ.100 కోట్ల క్లబ్లోకి కేవలం నాలుగు రోజుల్లోనే ఎంట్రీ ఇచ్చిన ‘ఇరుముడి’, రానున్న రోజుల్లో మరిన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. రవితేజ కెరీర్లో ఈ సినిమా ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.




