ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 వ పుట్టినరోజు వేడుకలు

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 47 వ పుట్టినరోజు వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు తన 47 వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. కాగా ఈ మేరకు ఆయన ఒక కొత్త పథకానికి కూడా శ్రీకారం చుట్టారు. ఇకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి కి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా ప్రధాని మోడీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా “ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆయనకు దీర్ఘ ఆయుష్సు, ఆరోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. ఇకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత మొదటిసారి వచ్చిన పుట్టినరోజు వేడుకల్ని చాలా ఘనంగా జరపాలని అభిమానులు, కార్యకర్తలు భారీగా ప్లాన్ చేస్తున్నారు.

ఇకపోతే తన ప్రతీ పుట్టినరోజు వేడుకల్ని ప్రజల మధ్యన జరుపుకునే జగన్మోహన్ రెడ్డి, ఈసారి కూడా ప్రజల మధ్యనే జరుపుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకనే నేడు అనంతపురం జిల్లా ధర్మవరం లో పర్యటించనున్న సీఎం జగన్, రాష్ట్రంలోని రైతన్నల కోసం ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈనేపథ్యంలో అనంతపురం జిల్లా ధర్మవరంలో ఒక భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా వేదికగా సీఎం జగన్ తన పుట్టినరోజు వేడుకలను ప్రజల సమక్షంలో జరుపుకోనున్నారు…