జగన్ పుట్టిన రోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు

జగన్ పుట్టిన రోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు

ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి వైసీపీ కార్యాలయంలో కేక్ ని కట్ చేసారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్ పాలన ఫై ప్రశంసలు కురిపించారు. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. విశాఖపట్టణం రాజధానిగా ప్రకటిస్తే ఇక చరిత్రలో జగన్ నిర్ణయం నిలిచిపోతుందని అన్నారు. కుల, మతాలకు అతీతంగా జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ ని అభివృద్ధి చేయాలనీ ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

అయితే చంద్రబాబు అయిదేళ్ల పాలనలో సాధ్యం కానీ పనుల్ని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అయిదు నెలల్లో చేసి చూపించారని కితాబిచ్చారు. అంతేకాకుండా, మరొక ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్ కొనసాగాలని అన్నారు. అయితే ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ పుట్టిన రోజు సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణి చేసారు.