కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌

అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష చేపట్టారు. కోవిడ్‌ నివారణపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయడంతో పాటు ఖరీఫ్‌ సన్నద్ధత, వ్యవసాయ రుణాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి, గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సమీక్ష చేపట్టారు. ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూముల అభివృద్ధిపై కూడా సీఎం జగన్‌ సమీక్ష జరుపుతున్నారు.