ప్రతి జియో వినియోగదారుడు తెలుసుకోవలసిన విషయం

ప్రతి జియో వినియోగదారుడు తెలుసుకోవలసిన విషయం

రిలయన్స్ జియో ఫైబర్‌ సేవలు అధికారికంగా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే రిజిస్ట్రర్ చేసుకున్న వినియోగదారులు హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, స్మార్ట్ హోం సొల్యూషన్ పొందనున్నారు. జియోఫైబర్ నెట్ బేసిక్‌ స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ కాగా.. గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు బ్యాండ్‌ విడ్త్‌ను అందించనున్నట్లు జియో తెలిపింది. జియో ఫైబర్‌ బేసిక్‌ ప్లాన్‌ 699 రూపాయల నుంచి మొదలవతుంది. గరిష్ట ధరను 8,499 రుపాయలుగా నిర్ణయించింది. ఈ ప్లాన్ కైనా వినియోగదారులు రూ. 2500 డిపాజిట్ చెల్లించి కనెక్షన్ పొందాల్సి ఉంటుంది.