టీడీపీ భేటీకి కాపు నేతల డుమ్మా….జంప్ ఖాయమా ?

kaapu leaders absent for tdp meeting

ఈరోజు అమరావతిలోని ప్రజావేదికను ఏపీ ప్రభుత్వం కూల్చివేసిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ ముఖ్య నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. తాజా రాజకీయ పరిణమాలు, ప్రజావేదిక కూల్చివేత  అంశాల మీద చర్చించారు. ఒకవేళ తాను ఉంటున్న భవనం కూల్చివేతకు ప్రభుత్వం ఉపక్రమిస్తే ఏం చేయాలన్న విషయమై నేతలతో చర్చించారు. ఈ భేటీకి కళా వెంకట్రావు, దేవినేని ఉమ, బుద్ధా వెంకన్న, కాల్వ శ్రీనివాసులు తదితరులు హాజరు కాగా, టీడీపీ కాపు నేతలు పలువురు గైర్హాజరు అయ్యారు. అయితే ఈ మధ్యనే పార్టీ అధిష్ఠానానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ కాపు నేతలు కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈరోజు జరిగిన భేటీకి బోండా ఉమ, వేదవ్యాస్, జ్యోతుల నెహ్రూ, పంచకర్ల రమేశ్ తదితరులు డుమ్మా కొట్టారు. బోండా ఉమ అయితే  విజయవాడలో ఉండికూడా ఈ సమావేశానికి రాలేదు. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా మూకుమ్మడిగా పార్టీని వీడి బీజేపీలో చేరుతారన్న ప్రచారానికి మరింత ఊతం ఇచ్చినట్టయ్యింది.