మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపింది. జూన్ 5 లోపు కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు అందజేసింది.
