కత్తి మహేష్‌ ఇష్యూ జాతీయ మీడియాలో..!

Mahesh Kathi vs Pawan Kalyan Fans

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

కత్తి మహేష్‌కు పవన్‌ ఫ్యాన్స్‌కు మద్య జరుగుతున్న యుద్దం ఇప్పట్లో ముగిసేలా లేదు. మీడియాలో ఈ విషయంపై తారా స్థాయిలో చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇన్ని రోజులు తెలుగు మీడియాలోనే ఈ వార్తలు ప్రసారం అయ్యాయి. తాజాగా జాతీయ మీడియా అయిన ఎన్‌డీటీవీలో కూడా కత్తి మహేష్‌, పవన్‌ ఫ్యాన్స్‌ ఇష్యూ వార్తను వేశారు. పవన్‌ ఫ్యాన్స్‌ ఫోన్‌ ద్వారా, సోషల్‌ మీడియా ద్వారా కత్తి మహేష్‌ను ఏ స్థాయిలో ఇరిటేట్‌ చేస్తున్నారో వారు ఒక కథనంను ప్రసారం చేయడం జరిగింది. కత్తి మహేష్‌ ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసి, ఇది పవన్‌ ఫ్యాన్స్‌ కోసం, ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా ప్రచారం జరుగుతుందని పోస్ట్‌ చేశాడు.నిమిషానికి 10 కాల్స్‌ కత్తి మహేష్‌ సెల్‌కు వస్తూనే ఉన్నాయి. ఆ కాల్స్‌ను లిఫ్ట్‌ చేయలేక కత్తి మహేష్‌ విసిగి పోతున్నాడు.

తాజాగా అందుకు సంబంధించిన ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో షేర్‌ చేశాడు. కత్తి మహేష్‌, పవన్‌ ఫ్యాన్స్‌ ఇష్యూ ఇప్పుడు జాతీయ మీడియాకు వెళ్లిన నేపథ్యంలో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఈ వివాదంకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని భావిస్తున్నారు. కత్తి మహేష్‌ను ఇక వివాదంను పెద్దది చేయవద్దని, పవన్‌కు సారి చెప్పాలంటూ సూచిస్తున్నారు. కాని కత్తి మహేష్‌ మాత్రం వివాదం తాను మొదలు పెట్టలేదని, తనను పవన్‌ ఫ్యాన్స్‌ హింసిస్తున్నంత వరకు నేను వారికి సమాధానం చెబుతూనే ఉంటాను. పవన్‌ లేదా పవన్‌ ఫ్యాన్స్‌ ఈ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని కత్తి మహేష్‌ అంటున్నాడు. ఈ వివాదంతో ఫుల్‌గా పబ్లిసిటీ దక్కించుకున్న కత్తి మహేష్‌ అంత సులభంగా వివాదాన్ని వదిలేందుకు సిద్దంగా లేడని సినీ వర్గాల వారు అంటున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న ఈ వివాదం ముందు ముందు మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..

మరిన్ని వార్తలు:

జాతకం కలవక నిఖిల్ పెళ్లి క్యాన్సిల్?

వెంకటేష్‌, అర్జున్‌ రెడ్డి కలిసి..?