పెంచలేదు.. కాస్త తగ్గించాను

keerthi suresh clarity about mahanati movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

‘మహానటి’ చిత్రం కోసం కీర్తి సురేష్‌ చాలా కష్ట పడుతుంది, గత సంవత్సరంనర కాలంగా కీర్తి సురేష్‌ ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. సావిత్రి పాత్రకు తగ్గట్లుగా ఉండేందుకు కీర్తి సురేష్‌ దాదాపు 10 కేజీల బరువు పెరిగింది అంటూ సోషల్‌ మీడియాలో ఆ మద్య పుకార్లు తెగ షికారు చేసిన విషయం తెల్సిందే. సావిత్రి కెరీర్‌ ఆరంభంలో నాజూకుగా ఉన్నా తర్వాత   చాలా లావు అయిన విషయం తెల్సిందే. అందుకే పాత్ర చక్కగా రావడం కోసం ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌ బొద్దుగుమ్మగా మారిందనే టాక్‌ వచ్చింది. తాజాగా ఆ వార్తలపై కీర్తి సురేష్‌ క్లారిటీ ఇచ్చింది.

సావిత్రి పాత్ర కోసం తాను బరువు పెరిగినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదని, అసలు తాను కనీసం ఒక్క కేజీ బరువు కూడా పెరగలేదు. పై పెచ్చు సినిమాలోని కొన్ని సీన్స్‌కు బరువు తగ్గినట్లుగా కనిపించాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక సావిత్రి కెరీర్‌ చివర్లో లావు ఎక్కువ అయిన సీన్స్‌ను కాస్మోటిక్స్‌ను వాడి షూట్‌ చేసినట్లుగా కీర్తి సురేష్‌ చెప్పుకొచ్చింది. తాను పాత్ర కోసం బరువు తగ్గడం అంటూ జరగలేదని, మహానటి చిత్రం కోసం చిత్ర యూనిట్‌ సభ్యులు అంతా కూడా చాలా కష్టపడ్డట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. సమంత పాత్ర కూడా చాలా ప్రముఖంగా ఉంటుందని, తప్పకుండా అందరికి ఆకట్టుకునేలా ‘మహానటి’ చిత్రం ఉంటుందనే అభిప్రాయంను కీర్తి సురేష్‌ వ్యక్తం చేసింది.