బీజేపీ ఎన్నికల కమిటీలలో విజయ శాంతికి కీలక పదవి..!

TG Politics: Leader of Bhavita Barhita Samiti (BRS) KTR: Vijayashanthi
TG Politics: Leader of Bhavita Barhita Samiti (BRS) KTR: Vijayashanthi

ఎన్నికల కమిటీలను ప్రకటించింది బీజేపీ పార్టీ. ఈ మేరకు 14 కమిటీలు నియామకం చేసింది. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్ గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్ గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియామకం అయ్యారు.

పబ్లిక్ మీటింగ్స్ ఇన్చార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్గా మురళీధర్ రావు, నిరసన కమిటీ చైర్మన్ గా విజయ శాంతి నియామకం అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది బీజేపీ. ఇది ఇలా ఉండగా, ఇవాళ హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఇవాళ రాత్రి 10 గంటల సమయంలో… హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. ఇక రేపు జరిగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరు కానున్నారు.