విహాన్ కార్తీక్, దివ్య విశ్వకర్మ జంటగా నటిస్తున్న ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం ‘కెరూబ్’(Kherrub). ఖుషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై బాలు బల్లెకారి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎం.జె. నాయుడు (జీవన్) దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేసిన చిత్రబృందం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమాను సెప్టెంబర్లో థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ‘కెరూబ్’ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. జలపాతం, పచ్చని ప్రకృతి మధ్య కథానాయకుడు వేణువు వాయిస్తున్న దృశ్యంతో రూపొందించిన ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇంతకుముందు విడుదలైన టీజర్కు కూడా మంచి స్పందన లభించిందని చిత్రబృందం వెల్లడించింది.
కల్పలత, సుమన్ శెట్టి, రమేష్ కొనంభొట్ల, గడ్డం సురేష్, శ్రీధర్ మాడ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సత్య రాధాకృష్ణ సంగీతం అందిస్తుండగా, రమేష్ తోకల సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రస్తుతం సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మేకర్స్ వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే ‘కెరూబ్’ అధికారిక విడుదల తేదీతో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
