కోడెల గుడిలో లింగాన్ని మింగేసే పూజారి : అంబటి

Kodela priest who swallows a Linga in a temple hut: Ambati

తన నివాసం అక్రమ నిర్మాణమని తెలిసి కూడా చంద్రబాబు వైసీపీపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు అంబటి రాంబాబు.  ఆయన నివాసాన్ని ముంచడానికి వరద ప్రవాహాన్ని ఆపామని దుష్ర్పచారం చేస్తున్నారని, ఇది వారి దిగుజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.

కృష్ణకు వరద వచ్చినప్పుడల్లా కరకట్ట మునుగుతుందన్న విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్‌ జగన్‌ ఓ కార్యక్రమంలో జ్యోతిప్రజ్వలన చేయనందుకు ఆయన హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ    దుష్ర్పచారానికి పాల్పడుతోందని విమర్శించారు అంబటి రాంబాబు.

వాస్తవాలు తెలుసుకోకుండా మాజీమంత్రి మాణిక్యాలరావు అవాక్కులు పేలుతున్నారని మండివడ్డరు. అక్కడ అగ్గిపెట్టెతో జ్యోతిప్రజ్వలన చేయరని, ఎలక్ర్టానిక్‌ పద్దతిలోనే జ్యోతిని వెలిగిస్తారని, ఈ విషయం తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు.

అసెంబ్లీ తనకు దేవాలయం..తాను పూజారిలా పని చేశానన్న మాజీ స్పీకర్‌ కోడెల వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు అంబటి రాంబాబు. నిజంగా ఆయన పూజారియే అని.. గుడిలో నూనెను, కొబ్బరి చిప్పలను, ఆఖరికి గుడిలో లింగాన్ని తన  కొడుకు, కూతురుతో కలిసి మింగేసిన పూజారి అని కామెంట్ చేశారు అంబటి.